TS News: బాలా త్రిపురసుందరిగా భద్రకాళి అమ్మవారు

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.

Updated : 07 Oct 2021 11:08 IST

వరంగల్‌: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. బాలత్రిపుర సుందరీ అలంకరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని