Triumala: తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. సుమారు రూ.3కోట్ల విలువచేసే బంగారు వరద కఠి హస్తాలను అందజేశారు.

Updated : 10 Dec 2021 19:26 IST

తిరుమల: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. సుమారు రూ.3కోట్ల విలువచేసే బంగారు వరద కఠి హస్తాలను అందజేశారు. వజ్రాలు, కెంపులు పొదిగి దాదాపు 5.3కిలోల బరువు గల ఆభరణాలను తితిదే అధికారులకు అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి వాటిని అందించారు. అనంతరం భక్తుడిని ఆలయ అధికారుల సత్కరించారు. దాత వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని