AP News: దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. ఆదివారం కావడంతో కనదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ప్రధాన క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో అమ్మవారిని దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేయిస్తున్నారు.
దర్శించుకున్న హైకోర్టు సీజే
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం కనకదుర్గమ్మ చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..