Srisailam: శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Updated : 05 Nov 2021 13:42 IST

శ్రీశైలం ఆలయం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్‌ 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధన చేశారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని