Ts News: కొత్త సంవత్సర వేళ.. బిర్లా మందిర్కు పోటెత్తిన భక్తులు
నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుతూ ఆదర్శ్ నగర్ లోని బిర్లా
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుతూ నగరంలోని బిర్లా మందిర్కు వేకువజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కొత్త ఏడాది ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా యువతి, యువకులు సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. అయితే కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.