SVPNA: జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోహ్‌

సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ(ఎస్‌వీపీఎన్‌ఏ)లో

Updated : 06 Aug 2021 09:27 IST

హైదరాబాద్‌: సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ(ఎస్‌వీపీఎన్‌ఏ)లో శిక్షణ పూర్తిచేసుకున్న 72వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు దీక్షాంత్‌ సమారోహ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీక్షాంత్‌ సమారోహ్‌ సందర్భంగా శిక్షణ పొందిన 178 మంది పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన వారిలో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది ఫారెన్‌ ఆఫీసర్స్‌ ట్రైనీలు ఉన్నారు. 144 మంది ఐపీఎస్‌లలో 23 మంది మహిళలు ఉన్నారు. ఐపీఎస్‌లలో తెలుగు రాష్ట్రాలకు 8 మందిని కేటాయించారు. ఏపీ, తెలంగాణకు నలుగురు చొప్పున రానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని