Dollar seshadri: ముగిసిన డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు

తిరుపతిలోని వైకుంఠ ప్రస్థానంలో డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు ముగిశాయి. డాలర్‌ శేషాద్రికి ఆయన సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం

Updated : 30 Nov 2021 16:49 IST

తిరుపతి: గుండెపోటుతో మరణించిన శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి అంతిమ సంస్కారాలు ముగిశాయి. తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర వైకుంఠధామంలో అంత్యక్రియలు జరిగాయి. శేషాద్రి సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. అంతకుముందు డాలర్‌ శేషాద్రి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో వైకాపా ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం సహా తితిదే సభ్యులు పాల్గొన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి పాడెమోశారు. వైకుంఠధామంలోనూ పలువురు శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని