TS News: యాదాద్రీశుడి ఆలయానికి భారీగా విరాళాలు
యాదాద్రీశుడి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి పలువురు
హైదరాబాద్: యాదాద్రీశుడి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి పలువురు విరాళాలు ఇచ్చారు. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ రూ.2.50 కోట్ల విరాళం అందించాయి. హెటిరో డ్రగ్స్ సీఎండీ బండి పార్థసారథి రెడ్డి, హానర్ ల్యాబ్స్ తరఫున దేవరకొండ దామోదరరావు చెక్కులను ఆలయ ఈవోకు అందించారు. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ తరఫున రూ.50లక్షలు, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ తరఫున రూ.50లక్షలు, హానర్ ల్యాబ్ లిమిటెడ్ తరఫున రూ.50లక్షలు, వ్యక్తిగతంగా బండి పార్థసారథి రెడ్డి రూ.50లక్షలు, దేవరకొండ దామోదర్రావు రూ.50లక్షలు విరాళం అందించారు.
మంత్రి సత్యవతి రాఠోడ్ విరాళం..
బంగారు తాపడం కోసం మంత్రి సత్యవతి రాఠోడ్ విరాళమిచ్చారు. తన ఒంటిపై ఉన్న నగలను ఆమె విరాళంగా ఇచ్చారు. 12తులాల బంగారాన్ని ఆలయ ఈవో గీతకు సత్యవతి రాఠోడ్ అందించారు. యాదాద్రిని కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా సందర్శించారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం