జగన్‌ అక్రమాస్తుల కేసు: మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో 2 అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలు చేసింది.

Published : 17 Aug 2021 11:40 IST

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో 2 అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన 11 ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఇప్పటికే 7 అభియోగపత్రాలను కోర్టుకు సమర్పించింది. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. దీంతో పాటు తాజాగా వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులకు సంబంధించిన మరో 2 ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది. ఈ రెండు ఛార్జిషీట్లు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. న్యాయస్థానం వాటిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులకు సమన్లు జారీ అయ్యే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని