sabitha Indrareddy: అన్నీ ఆలోచించాకే పాఠశాలలు ప్రారంభిస్తున్నాం: సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న శానిటేషన్ పనులు, తరగతి గదులు, మైదానాన్ని పరిశీలించారు. విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రి.. వెంటనే నీటి సదుపాయం కల్పించాలని గ్రామ సర్పంచ్ను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో గుంతలు పూడ్చాలని, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. గురువారం నుంచి ఉపాధ్యాయులు ప్రతి రోజు పాఠశాలలకు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. చాలా రోజుల తర్వాత విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నందున కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంత్రి పరిశీలించారు.
అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించిన తర్వాతే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీఎం కేసీఆర్ పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటివరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించాం. ఇక నుంచి ఆఫ్ లైన్లో తరగతులు ఉంటాయి. వైద్యారోగ్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1నుంచి తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. సర్పంచుల ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి. ప్రైవేటు పాఠశాలలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి. పాఠశాల బస్సులను నిత్యం శానిటైజ్ చేయాలి’’ అని మంత్రి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు