TS News: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు- బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 25 Oct 2021 11:23 IST

వాజేడు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు- బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రేహౌండ్స్‌ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో ఏకే 47,ఎస్‌ఎల్‌ఆర్‌లతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని