Fake Wedding Guests: పెళ్లికి నకిలీ అతిథులు.. అదో వ్యాపారం తెలుసా..?
జీవితంలో మరో బంధంలోకి అడుగుపెట్టే వేడుక వివాహం. దీన్ని సాధ్యమైనంత అందంగా మలచుకోవాలని ప్రతిఒక్కరు కలలుకంటారు. ఆ వేడుకలో తమ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. వధూవరుల ముస్తాబు, పెళ్లి మండపం అలంకరణ, వంటలు, అతిథి మర్యాదలు ఇలా ప్రతిదానిలో తమ హోదా కనిపించేలా చూసుకుంటారు.
ఎక్కడంటే..?
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో మరో బంధంలోకి అడుగుపెట్టే వేడుక వివాహం. దీన్ని సాధ్యమైనంత అందంగా మలచుకోవాలని ప్రతిఒక్కరు కలలుకంటారు. ఆ వేడుకలో తమ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. వధూవరుల ముస్తాబు, పెళ్లి మండపం అలంకరణ, వంటలు, అతిథి మర్యాదలు ఇలా ప్రతిదానిలో తమ హోదా కనిపించేలా చూసుకుంటారు. దక్షిణ కొరియా వాసులు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోరు. అక్కడివారు ఎంత ఎక్కువమంది అతిథులు హాజరైతే అంత గొప్పగా భావిస్తుంటారు. ప్రజల మనసును కనిపెట్టిన కంపెనీలు దీన్నే వ్యాపార ఆలోచనగా మలుచుకున్నాయి. అలా పుట్టుకొచ్చిందే ఫేక్ వెడ్డింగ్ గెస్ట్స్( నకిలీ వివాహ అతిధులు) వ్యాపారం.
వివాహ తంతు వరకు మొత్తం కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు వెడ్డింగ్ ప్లానర్లు. అదే తరహాలో ఈ కంపెనీలు వధూవరులు కోరిన మేరకు నకిలీ వెడ్డింగ్ గెస్ట్లను అందుబాటులో ఉంచుతారు. వారు పెళ్లిలో కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూసుకుంటారు. తామే ఈ పెళ్లి అతిథులం అన్నట్లు దర్జాగా కూర్చుంటారు. దాంతో తమ తరఫు పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని వధూవరుల కుటుంబాలు సంతృప్తి పడగటంతో పాటు.. ఇటు కంపెనీల జేబులు నిండుతాయి.
ఇప్పుడు దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను సడలించింది. వివాహానికి హాజరయ్యే అతిథుల సంఖ్య 99కి పెంచింది. మున్ముందు ఆ సంఖ్యను 250కి పెంచే యోచనలో ఉంది. ఈ క్రమంలో నకిలీ వెడ్డింగ్ గెస్ట్ల వ్యాపారం మళ్లీ పుంజుకుంటోందని అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది. నకిలీ గెస్టుల కోసం గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఓ కంపెనీ ఉద్యోగి వెల్లడించారు. అలాగే టీకా వేశాకే వారిని అతిథులుగా పంపుతున్నట్లూ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప