Crime News: విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం: 20 పూరిళ్లు దగ్ధం

విజయనగరం జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెంటాడ మండలం జక్కువలసలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి.

Updated : 12 Nov 2021 21:44 IST

మెంటాడ: విజయనగరం జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెంటాడ మండలం జక్కువలసలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత క్రమంగా మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో స్థానికులు  తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో దాదాపు 20 పూరిళ్లు దగ్ధమైనట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు  స్థానిక పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని