Ap News: తిరుపతిలో వరదనీటి నిల్వతో కుంగుతున్న ఇళ్ల పునాదులు
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తిరుపతి నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు రోజుల తరబడి ఇళ్ల మధ్య నిల్వ ఉండటంతో ఇళ్ల పునాదులు కుంగుతున్నాయి...
తిరుపతి: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తిరుపతి నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు రోజుల తరబడి ఇళ్ల మధ్య నిల్వ ఉండటంతో ఇళ్ల పునాదులు కుంగుతున్నాయి. తిరుపతి శ్రీకృష్ణా నగర్లోని 8వ క్రాస్లో 18 ఇళ్లకు గోడలు పగళ్లు ఏర్పడ్డాయి. మూడంతస్తుల భవనం గోడలు బీటలు వారడంతో కూలిపోయే స్థితికి చేరింది. బీటలు వారిన భవనం సమీపంలోని ఇళ్లపై పడే అవకాశం ఉండటంతో కూల్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరదనీరు నిల్వ ఉండటంతో పాటు బలహీనమైన నిర్మాణాలతో భవనాలు కూలిపోయే పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. తమ ఇల్లు కూల్చవద్దని భవన యజమాని అధికారులను వేడుకున్నారు. ఇళ్ల పునాదులు కుంగడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్లో ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చిన ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యుడు కరుణాకర్రెడ్డితో పాటు తెలుగుదేశం నేతలు పరిశీలించారు. వరదతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని కరుణాకర్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు