SC Railway: దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు
సహజ ఇంధన పరిరక్షణ, అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థంగా వినియోగించినందుకు దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. భారత
సికింద్రాబాద్: సహజ ఇంధన పరిరక్షణ, అందుబాటులో ఉన్న ఇంధన వనరులను సమర్థంగా వినియోగించినందుకు దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. భారత బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, విద్యుత్ మంత్రిత్వశాఖ అవార్డులను ప్రకటించింది. 2021కి గాను పలు కేటగిరీల్లో నాలుగు అవార్డులను దక్షిణ మధ్య రైల్వే సాధించింది. భవనాల కేటగిరిలో ఆసుపత్రుల విభాగం కింద విజయవాడ డివిజినల్ రైల్వే ఆసుపత్రి మొదటి బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో కాచిగూడ స్టేషన్ చారిత్రక కట్టడానికి మొదటి బహుమతి దక్కింది. సంస్థల కేటగిరిలో విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ రెండవ బహుమతి సాధించింది. సంస్థల కేటగిరిలో సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయ భవనం ‘సంచాలన్ భవన్’కు మెరిట్ సర్టిఫికెట్ లభించింది. ఈనెల 14 నుంచి 21 వరకు జరిగే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అవార్డులను అందజేయనున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడంలో కృషి చేసిన అధికారును దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..