AP News: శ్రీవారి దర్శనం కల్పిస్తామని.. తితిదే ఛైర్మన్‌ పేరుతో దళారుల మోసం

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని కొందరు దళారులు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేరు

Updated : 23 Sep 2021 12:13 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని కొందరు దళారులు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేరు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. సుపథం మార్గంలో దర్శనం కల్పిస్తామని భక్తులకు ఆశ కల్పించి మోసగిస్తున్నారు. తితిదే ఛైర్మన్‌ సిఫార్సు లేఖ ఇప్పిస్తామని చెప్పిన కొందరు దళారులు.. వైవీ సుబ్బారెడ్డి పేరుతో భక్తులకు మెసేజ్‌లు పంపారు. వారి నుంచి రూ.8 వేలు తీసుకొని ఈ మెసేజ్‌లు పంపినట్లు బాధితులు చెప్పారు.

ఈ మెసేజ్‌లతో భక్తులు ఛైర్మన్‌ కార్యాలయానికి వెళ్లగా.. అవి నకిలీ సిఫార్సులుగా తేలింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 11 టికెట్ల కోసం దళారులు రూ.16 వేలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని