ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుల బారులు

మహానగరంలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో వినాయక ప్రతిమలు ఉండటంతో పాటు వర్షం

Updated : 20 Sep 2021 09:12 IST

హైదరాబాద్: మహానగరంలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో వినాయక ప్రతిమలు ఉండటంతో పాటు వర్షం కారణంగా నిన్న ప్రారంభమైన నిమజ్జనం ఆలస్యమైంది. దీంతో ఎన్టీఆర్ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై గణనాథుడి ప్రతిమలు బారులు తీరాయి. వీటితో పాటు బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రీ వైపు కూడా వినాయకుడి ప్రతిమలు నిమజ్జనానికి కదులుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద 1 క్రేన్ సాయంతో విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ వైపు, అంత కంటే తక్కువ ఉన్న వాటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని