TS NEWS: సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ..
హైదరాబాద్: సింగరేణిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ సింగరేణి అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 31 నుంచి రిటైర్ అయిన అందరికీ ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఈనెల 31లోపు విధుల్లో చేరాలని తెలిపారు. దీంతో మార్చి 31 నుంచి రిటైర్ అయిన 1,082 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరనున్నారు. పదవీ విరమణ వయసు పెంపుతో సింగరేణిలో పనిచేస్తున్న 43,899 మందికి ప్రయోజనం చేకూరనుంది.
సింగరేణి కార్మికులకు సంబంధించి పదవీ విరమణ వయసు పెంపు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా అంశాలు, వాటి పరిష్కారాలపై సీఎం కేసీఆర్ గత నెల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రాంతానికి చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలు, ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయసు 61ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశంలో దీనిపై సమీక్షించి పెంపు అమలు తేదీని ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఉద్యగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి తాజాగా సింగరేణి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM