Guntur: గుంటూరు నగర ప్రజలకు త్వరలో తీపి కబురు!
నగరంలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. నగర వెలుపల చిన్న పరిశ్రమ పెట్టుకోవాలన్నా ప్రస్తుతం నగరపాలకకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ విలువపై 14 శాతం ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లిస్తే తప్ప అనుమతులు ఇవ్వడం లేదు. నగరపాలక ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్రంలోనే
14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు తగ్గించే యోచన
ఈనాడు, అమరావతి
నగరంలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. నగర వెలుపల చిన్న పరిశ్రమ పెట్టుకోవాలన్నా ప్రస్తుతం నగరపాలకకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ విలువపై 14 శాతం ఓపెన్ స్పేస్ కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లిస్తే తప్ప అనుమతులు ఇవ్వడం లేదు. నగరపాలక ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అప్పటి నగర కమిషనర్ కన్నబాబు అమలు చేశారు. ఇది సామాన్య, మధ్య తరగతి వర్గాలకు నడ్డివిరిచేలా ఉందని, దీన్ని ఉపసంహరించుకోవాలని గతంలో అనేక మంది విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం నగరపాలకకు కౌన్సిల్ ఏర్పడడంతో దీనిపై అనేక మంది మేయర్ను కలిసి ఇది భారంగా ఉందని, దీన్ని తీసేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఆయన వేర్వేరుగా రెండు కమిటీలు ఏర్పాటు చేసి ఆ నివేదికల ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ, నగరపాలక రెవెన్యూ, ప్రణాళిక, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో మరో కమిటీ వేసి వెంటనే వారి నుంచి నివేదికలు తెప్పించాలని నగరపాలక ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో రూ.10లక్షల విలువ కలిగిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే దానిపై తొలుత 14 శాతం అంటే రూ.1.40లక్షలు చెల్లించాలి. ఇది చాలా భారం కావడంతో గుంటూరు నగరం వెలుపల మిర్చియార్డు, నల్లపాడు, ఏటుకూరు, బుడంపాడు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో కారం మిల్లులు తదితర పరిశ్రమలు నిర్మించాలనుకున్నవారు సుమారు 200 మంది మధ్యస్తంగా నిర్మాణాలు నిలిపివేశారు. 2015 నుంచి ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది. తాజాగా దానిపై కౌన్సిల్ దృష్టి పెట్టిందని, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారం కాకుండా ఆయా కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఫీజులను తగ్గిస్తామని మేయర్ మనోహర్నాయుడు ‘ఈనాడు’కు వివరించారు. కమిటీల నుంచి నివేదికలు రాగానే వాటిని కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని చెప్పారు.
వీరికి మినహాయింపు
నగరంలో 1985కు ముందు ఇంటి ప్లాను పొందిన వారికి, అప్పటికే ఇంటి పన్ను చెల్లింపు రసీదు కలిగిన వారికి, అనుమతి పొందిన లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేసుకునే వారికి ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. మురికివాడల్లో నివాసం ఉండే వారికి ఇది వర్తించదు. ఇవి మినహా మిగిలిన ఎవరైనా దాన్ని చెల్లించాల్సిందే. 100 గజాల పైబడిన స్థలాల్లో ఏ నిర్మాణం చేయాలన్నా 14 శాతం ఫీజు చెల్లించే విధానం 2014 నుంచి నగరంలో అమలవుతోందని నగర ప్రణాళికవర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..