TS News: అందరి సహకారంతోనే మహమ్మారిని ఎదుర్కోగలం: తమిళిసై

ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై విజ్ఞప్తి చేశారు.

Updated : 01 Jan 2022 12:54 IST

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై విజ్ఞప్తి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సి్‌న్ వేసుకొని, మాస్క్‌ ధరించి ఒమిక్రాస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్‌ సూచించారు. ఈ ఏడాది కొవిడ్‌ రహితంగా తయారవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 100శాతం వ్యాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని