TS News: కేవలం ఒక డోస్‌ వల్ల ఉపయోగం ఉండదు: గవర్నర్‌ తమిళిసై

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ తొలి డోస్‌ 100 శాతం పూర్తికావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు..

Updated : 29 Dec 2021 13:38 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ తొలి డోస్‌ 100 శాతం పూర్తికావడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. కేవలం ఒక డోస్‌ వల్ల ఉపయోగం లేదని.. సరైన సమయానికే రెండో డోస్‌ కూడా తీసుకోవాలని ప్రజల్ని ఆమె కోరారు. హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీ అర్బన్‌ పీహెచ్‌సీని గవర్నర్‌ సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీకా తీసుకోని వారిపై కరోనా ప్రభావం అధికంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా మాస్క్‌ కచ్చితంగా ధరించాలని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని తమిళిసై కోరారు. 2022 ఆరోగ్య నామ సంవత్సరంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని