AP News: ‘అమ్మఒడి’పై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు
గుంటూరు: అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేసే క్రమంలో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు లేఖలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు వెళ్తున్నాయి. మీ పిల్లల హాజరు 75శాతం ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయుల లేఖలో సూచిస్తున్నారు. ఈ లేఖపై తల్లిదండ్రుల సంతకం చేయించుకుని రావాలని విద్యార్థులకు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల్ని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఈ మేరకు లేఖలు రాస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది ఉండొద్దని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం విద్యార్థుల హాజరు కూడా ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో నమోదు చేయాల్సి వస్తోంది. ఫొటోలను జత చేయటం తప్పనిసరి. కాబట్టి విద్యార్థుల హాజరు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ ఏడాది అమ్మఒడి పథకానికి సంబధించి నగదుని వచ్చే ఏడాది జూన్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకూ ఉన్న హాజరును బట్టి వారికి పథకం వర్తింపుపై నిర్ణయం తీసుకుంటారని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల హాజరులో కాస్త తగ్గుదల ఉంటుందని.. దీని ఆధారంగా పథకం వర్తించకుండా చేస్తారేమో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ గోల్డ్..మా ఆలోచన విధానాన్నే మార్చేసింది: భారత అథ్లెట్లు
-
Latestnews News
Whatsapp: వాట్సాప్ నుంచి కొత్త అప్డేట్.. ఇక 2 రోజుల తర్వాతా డిలీట్!
-
Movies News
Nithiin: సెట్స్లో నితిన్, కృతిశెట్టి నవ్వులు.. ‘మాచర్ల..’ మేకింగ్ వీడియో చూశారా!
-
Politics News
Harish Rao: తక్షణమే 50లక్షల వ్యాక్సిన్లు పంపండి: కేంద్రానికి హరీశ్ లేఖ
-
Politics News
Bihar: భాజపాతో పొత్తు ముగిసింది.. పార్టీ నేతల సమావేశంలో నీతీశ్ నిర్ణయం
-
General News
Nellore: నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!