కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో  జలాశయం...

Updated : 28 Jul 2021 20:21 IST

శ్రీశైలం: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో  జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ద్వారా ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. మొదట ఒక గేటు ఎత్తినప్పటికీ క్రమంగా పదిగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు డ్యామ్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.

 2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు తెలిపారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.5 అడుగులకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని