AP News: నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు: హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. డ్రోన్ వీడియో
నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి.
నెల్లూరు: నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. అల్పపీడనం కారణంగా నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ ఉదయం గూడూరు- మనుబోలు మధ్య పంబలేరు వరద ప్రవాహంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అక్కడి వరద పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. మరోవైపు కండలేరు డ్యామ్ నుంచి వరద పోటెత్తడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు చెరువు నిండుకుండలా మారి రోడ్డుపై వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
మర్రిపాడు మండలం పి.నాయుడు పల్లి, చుంచులూరు గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. చుంచులూరు వద్ద కేత మన్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రెండు రోజులుగా ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా 500 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రెండు గ్రామాలపైన ఉన్న చెరువులు ప్రమాదకర స్థాయిలో నీటితో నిండి ఉండటంతో ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాయుడుపేటలో భారీ వర్షాల కారణంగా పంటల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో అవి ఎప్పుడు కూలిపోతాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పశువులు మేత కోసం అలమటిస్తున్నాయని.. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమశిలకు భారీగా వరద..
భారీ వర్షాల కారణంగా సోమశిల జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. జలాశయం ఇన్ఫ్లో 96,569 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ఫ్లో 1,15,396క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 77.98టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 68.37టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ