AP News: అనంతపురంలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌

ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురం నగరంలో ఆందోళన చేపట్టాయి.

Updated : 08 Nov 2021 13:53 IST

ఎస్ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత 

​​​

అనంతపురం(విద్య): ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల, పాఠశాల విలీనాన్ని ఉప సంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరిస్తూ.. అందుకు సంబంధించిన పత్రాన్ని విద్యాశాఖ అధికారులకు సమర్పించింది. దీన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ప్రైవేటు పరం చేస్తే ఫీజుల భారం మోయలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఇవాళ ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారు విద్యార్థులపై లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఓ విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని