AP News: విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం.. తీవ్ర ఉద్రిక్తత

విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం చోటు చేసుకుంది.

Updated : 04 Jan 2022 14:34 IST

విశాఖ: విశాఖలో పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం చోటు చేసుకుంది. ఓ వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడంతో మరో వర్గం వారిని అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో సముద్రంలో పడవకు ఓ వర్గం మత్స్యకారులు నిప్పు పెట్టారు. దీంతో వాసవానిపాలెం తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన బోట్లను బయటికి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. బోట్లకు నిప్పు పెట్టారని, తమ పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. వలలు కోసేశారని, తమ వాళ్లను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని