Ts News: హైదరాబాద్‌ మెట్రో శుభవార్త.. మళ్లీ అందుబాటులోకి సువర్ణ ఆఫర్‌

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో సువర్ణ ఆఫర్‌ను ప్రయాణికుల కోసం మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్‌ 18వ తేదీ నుంచి మెట్రో సువర్ణ

Updated : 14 Oct 2021 19:10 IST

హైదరాబాద్‌: పండుగల సీజన్‌ను పురష్కరించుకొని ప్రయాణికుల కోసం ఎల్‌ అండ్ టీ మెట్రో రైల్‌ సంస్థ ‘మెట్రో సువర్ణ ఆఫర్‌-2021’ను ప్రకటించింది. ట్రిప్‌ పాస్ ఆఫర్‌ కింద 45 రోజుల్లో 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పుల ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్‌ కాలంలో ట్రిప్‌కు గరిష్ఠంగా 15 రూపాయలు చెల్లించి గ్రీన్‌లైన్‌పై ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. ఈ ట్రిప్పులను 45 రోజుల్లోగా వినియోగించుకోవాల్సి ఉంటుందని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆఫర్‌ కేవలం మెట్రో స్మార్ట్‌ కార్డ్‌పై మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మెట్రో ప్రయాణికులు ఈ ఆఫర్‌ను 18 అక్టోబర్‌ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని మెట్రో స్టేషన్‌లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల కోసం నూతన ఆఫర్లతో మెట్రో సువర్ణ ఆఫర్‌ను తిరిగి పరిచయం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉందని హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని