Ts News: హైదరాబాద్ మెట్రో శుభవార్త.. మళ్లీ అందుబాటులోకి సువర్ణ ఆఫర్
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. మెట్రో సువర్ణ ఆఫర్ను ప్రయాణికుల కోసం మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 18వ తేదీ నుంచి మెట్రో సువర్ణ
హైదరాబాద్: పండుగల సీజన్ను పురష్కరించుకొని ప్రయాణికుల కోసం ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థ ‘మెట్రో సువర్ణ ఆఫర్-2021’ను ప్రకటించింది. ట్రిప్ పాస్ ఆఫర్ కింద 45 రోజుల్లో 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పుల ప్రయాణం చేయవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ కాలంలో ట్రిప్కు గరిష్ఠంగా 15 రూపాయలు చెల్లించి గ్రీన్లైన్పై ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. ఈ ట్రిప్పులను 45 రోజుల్లోగా వినియోగించుకోవాల్సి ఉంటుందని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆఫర్ కేవలం మెట్రో స్మార్ట్ కార్డ్పై మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మెట్రో ప్రయాణికులు ఈ ఆఫర్ను 18 అక్టోబర్ 2021 నుంచి 15 జనవరి 2022 మధ్య వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని మెట్రో స్టేషన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల కోసం నూతన ఆఫర్లతో మెట్రో సువర్ణ ఆఫర్ను తిరిగి పరిచయం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉందని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్