TS NEWS: ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్‌ శర్మ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న సునీల్ ..

Published : 13 Oct 2021 11:05 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న సునీల్ శర్మను బదిలీ చేశారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమించారు. గృహనిర్మాణ శాఖ బాధ్యతలను కూడా ఆయన అదనంగా నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఇంధనశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ సుల్తానీయాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. పర్యాటక, క్రీడల శాఖ కార్యదర్శిగా ఉన్న కె.ఎస్‌. శ్రీనివాసరావు.. రవాణా, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని