TS News: వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల ధరల పెంపు

వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలను పెంచారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ..

Updated : 10 Nov 2021 11:42 IST

హైదరాబాద్‌: వేములవాడ రాజన్న ఆలయంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలను పెంచారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వామివారి కల్యాణం టికెట్‌ ధర రూ.వెయ్యి నుంచి రూ.1,500కు, మహా రుద్రాభిషేకం టికెట్‌ ధర రూ.600 నుంచి రూ.1,000కి, అన్నపూజ టికెట్‌ ధర రూ.600నుంచి రూ.1000కి, సోమేశ్వరాలయ అభిషేకం టికెట్‌ ధర రూ.500కు, సోమేశ్వరాలయ అన్నపూజ టికెట్‌ ధర రూ.500లకు, సత్యనారాయణ వ్రతం టికెట్‌ ధర రూ.400 నుంచి రూ.600కు, కుంకుమ పూజ టికెట్‌ ధర రూ.150 నుంచి రూ.300లకు, భీమేశ్వరాలయ అభిషేకం టికెట్‌ ధర రూ.200కు, నవగ్రహ పూజ టికెట్‌ ధర రూ.100 నుంచి రూ.300లకు పెంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని