ap news: గెజిట్ను స్వాగతిస్తున్నాం: ఏపీ
తెలంగాణ చర్యల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయిందని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా
అమరావతి: తెలంగాణ చర్యల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయిందని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర జల్శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అక్టోబరు 14 నుంచి జల్శక్తి శాఖ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందన్నారు. బేసిన్ పరిధిలో లేని వాటినీ నోటిఫికేషన్లో పేర్కొన్నారని, వాటిని సవరించాల్సి ఉందన్నారు. వెలుగొండపై తలెత్తిన అక్షర దోషాలను సవరించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
‘‘సాగునీరు విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. విద్యుత్ ఉత్పత్తి కోసం సాగునీరు విడుదల చేయకూడదు. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే 45 రోజులుగా తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 30.38 టీఎంసీల ఇన్ఫ్లో ఉంటే, అందులో 29.82టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం 806.8 అడుగులు మాత్రమే ఉంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు తీసుకోవాలంటే కనీసం 854 అడుగులు ఉండాలి. దీంతో పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన 8టీఎంసీల నీరు సముద్రం పాలైంది. జూన్ నుంచి ఇప్పటివరకు తెలంగాణ 66 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడింది. దీనిపై సీఎం జగన్ ప్రధానికి ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ పరిధి నిర్ణయించడంతో పాటు, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత బోర్డు పరిధిలో ఉండేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. ఈ క్రమంలో కేంద్ర జల్శక్తి శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నాం’’ అని శ్యామలరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్