AP News: అరుదైన దృశ్యం.. జేసీ ప్రభాకర్‌, పరిటాల శ్రీరామ్‌ ఆత్మీయ ఆలింగనం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి..

Updated : 10 Nov 2021 15:03 IST

అనంతపురం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పరిటాల శ్రీరామ్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి చేరుకోగా అక్కడికి వచ్చిన శ్రీరామ్‌ను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సరదాగా మాట్లాడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అనంతపురం జిల్లాలో జేసీ వర్గానికి, పరిటాల వర్గానికి ఎంతో శత్రుత్వం ఉంది. ఇంతకుముందు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు రెండు వర్గాలకు పొగిసేది కాదు. ఆ తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశంలోకి చేరినా వీరిరువురు కలవడం చాలా అరుదుగా జరిగేది. ఇప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో ఇరు వర్గాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని