Ap News: ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు నోడల్ అధికారి నియామకం
ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరగనుంది. పీఆర్సీ నివేదిక, అమలు, ఫిట్మెంట్, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, వాటి పరిష్కారంపై భేటీలో
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలతో రేపు మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరగనుంది. పీఆర్సీ నివేదిక, అమలు, ఫిట్మెంట్, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, వాటి పరిష్కారంపై భేటీలో చర్చించనున్నారు. పీఆర్సీ అమలు విషయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో మరోసారి భేటీ కావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞప్తులను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమించింది. ఈ మేరకు నోడల్ అధికారిగా ఆదినారాయణను నియమిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
పీఆర్సీ నివేదిక కోసం సచివాలయం వేదికగా ఉద్యోగ సంఘాల నేతలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు నేతలు.. ఐదున్నర గంటలపాటు పట్టువీడలేదు. బుధవారం మధ్యాహ్నం 4గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నానని, వేచి ఉండాలని సీఎస్ చెప్పారంటూ.. నేతలు రెండో బ్లాకు ముందు ఎదురుచూశారు. చీకటి పడినా స్పందన రాకపోవడంతో.. నివేదిక ఇచ్చేవరకూ కదలబోమని భీష్మించారు. సచివాలయ భద్రతా సిబ్బంది ఒత్తిడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్