MP Raghurama: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు  చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

Updated : 14 Sep 2021 16:34 IST

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు  చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై తీర్పును ఇవాళ వెలువరించాల్సి ఉండగా న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరో వైపు అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి యిల్‌ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని