Koganti Satyam: మాచవరం పోలీసుల కస్టడీలోకి కోగంటి సత్యం

యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను

Updated : 02 Sep 2021 13:49 IST

విజయవాడ: యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను విజయవాడ మాచవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్‌ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న అతడిని రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఈ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సత్యాన్ని ఇటీవల కోర్టులో హజరుపరచగా అతడికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి సత్యాన్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటికొచ్చే అవకాశం ఉందనే నేపథ్యంలోనే కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని