Ts News: ఆ ప్రాజెక్టుల వివరాలు రేపట్లోగా ఇవ్వాలి: కేఆర్ఎంబీ సబ్కమిటీ
బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారాన్ని రేపటి లోగా అందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు రవికుమార్ పిళ్లై రెండు రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు....
హైదరాబాద్: బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారాన్ని రేపటి లోగా అందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్యుడు రవికుమార్ పిళ్లై రెండు రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు. గెజిట్ అమలుపై పిళ్లై నేతృత్వంలోని కేఆర్ఎంబీ ఉపసంఘం హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. దశలవారీగా అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని.. ఇందులో భాగంగా మొదటి దశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ప్రాజెక్టులు కానందున బనకచర్ల కాంప్లెక్స్, కృష్ణా డెల్టా సిస్టం మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు, కేంద్రాల వివరాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఏపీకి చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని 22 కేంద్రాలు బోర్డు అధీనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, శ్రీశైలానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల సహా ఏడు కేంద్రాలు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించినట్లు సమాచారం. శ్రీశైలం ఎడమగట్టును కూడా బోర్డు అధీనంలోకి తీసుకోవాలని ఏపీ కోరగా.. బోర్డు కూడా వివరాలు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే, తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని అన్నట్లు సమాచారం. పులిచింతల తరహాలోనే జూరాలను కూడా ఉమ్మడి ప్రాజెక్టుగా పరిగణించి బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరగా.. తెలంగాణ విభేదించినట్లు సమాచారం. 12వ తేదీన కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం ఉన్నందున రేపటిలోగా అన్ని వివరాలు అందించాలని రెండు రాష్ట్రాల అధికారులకు పిళ్లై సూచించారు. బోర్డు నిర్వహణ కోసం సీడ్ మనీ విషయమై కూడా ఉపసంఘం భేటీలో చర్చ జరిగింది. నిధుల అంశం ప్రభుత్వాల పరిశీలనలో ఉందని రెండు రాష్ట్రాల అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్