KTR: హైదరాబాద్లో నాలాలకు శాశ్వత పరిష్కారం: కేటీఆర్
నగరంలో నాలాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.859కోట్లతో నాలాల
హైదరాబాద్: నగరంలో నాలాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.859కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. హుస్సేన్సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణానికి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ పోగ్రాంలో భాగంగా ఫీవర్ ఆస్పత్రి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హుస్సేన్సాగర్ వరదనీటి నాలా రక్షణగోడ నిర్మాణానికి రూ.68.4 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లోని చాలా కాలనీలు జలమయం అవ్వగా.. రక్షణ గోడ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా రక్షణగోడ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి చేయాలి. నాలాలపై ఉంటున్న వారికి నష్టం లేకుండా పనులు చేస్తాం. గతేడాది వర్షాలకు హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా పొంగింది. వరదలతో ప్రజలంగా ఇబ్బందులు పడ్డారు. 12కి.మీ నాలాకు రక్షణగోడ నిర్మించాలని కోరారు. నాలాల అభివృద్ధితో పాటు వాటి విస్తరణ పనులు చేస్తాం. జీహెచ్ఎంసీతో పాటు శివారు మున్సిపాలిటీల్లోనూ నాలాల అభివృద్ధి చేస్తాం’’అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి