
TS News: హైదరాబాద్ సిగలో మరో ఫ్లైఓవర్.. ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: నగరం సిగలో మరో ఫ్లైఓవర్ చేరింది. కంచన్బాగ్లోని ఫిసల్బండ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆసుపత్రి కూడలి మీదుగా బైరామల్గూడ వైపు వెళ్లేందుకు ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఒవైసీ- మిధాని కూడళ్లలో జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. రూ.80 కోట్లు వెచ్చించి మూడు వరుసల రహదారిని 1.3కిలోమీటర్ల మేర ఈ పైఓవర్ను నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా పైవంతెన నిలవనుంది. ముఖ్యంగా పాతబస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్నగర్, సాగర్ రింగ్రోడ్, ఎల్బీనగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ పైవంతెన ద్వారా చాంద్రాయణగుట్ట, కర్మాన్ఘాట్ మార్గాల ద్వారా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.