TS News: ట్రావెల్ ఏజెంట్లు, గైడ్లకు కనీస వడ్డీతో రుణాలు : కిషన్రెడ్డి
కరోనాతో దెబ్బతిన్న ట్రావెల్ ఏజెంట్లు, గైడ్లకు కనీస వడ్డీతో రుణాలిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: కరోనాతో దెబ్బతిన్న ట్రావెల్ ఏజెంట్లు, గైడ్లకు కనీస వడ్డీతో రుణాలిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో .. కొవిడ్ వల్ల దెబ్బతిన్న టూరింజ గైడ్లు, ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లోన్ గ్యారెంటీ స్కీమ్ కింద రుణాలకు సంబంధించిన చెక్కులను కిషన్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా విద్య, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలను తలపించే అద్భుతమైన చారిత్రక, పర్యాటక కట్టడాలు మన దేశంలో ఉన్నాయని, స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను మనమే ప్రమోట్ చేసి ఆదరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, మాస్కు ధరించటం వంటి అన్ని రకాల జాగ్రత్తలతో పర్యాటకాన్ని మళ్లీ పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. హెరిటేజ్ సర్క్యూట్ కింద సెవెన్ టూంబ్స్ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనిపై ఉన్న చిక్కుల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. రైల్వే, టూరిజం శాఖ సంయుక్తంగా 3,600 కోచ్లను ప్రైవేటు సెక్టార్కు ఇచ్చి, వారికి అనుకూలంగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. త్వరలో వరంగల్ వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ పై జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తామని, భూదాన్ పోచంపల్లిలో నేషనల్ టూరిజం డే వేడుకలు నిర్వహించనున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు