Lance Naik Sai Teja: సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు..
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో
కురబలకోట: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన నివాసం వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు స్థానిక పోలీసు అధికారులు సాయితేజ కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయితేజ అంత్యక్రియల కోసం గ్రామంలో ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.
అందరితో కలివిడిగా ఉండేవాడు: గౌతమి, సాయితేజ పిన్ని
సాయితేజ అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని అతడి పిన్ని గౌతమి చెప్పారు. గ్రామంలో పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాల సమయాల్లో ఎంతో సరదగా వచ్చి పాల్గొనేవాడన్నారు. తమకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టేవాడని ఆమె తెలిపారు. పిల్లలకు ఎన్నో మంచి మాటలు చెప్పేవాడని గౌతమి చెప్పారు. అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని వారికి వివరించేవాడన్నారు.
సాయితేజకు చిన్ననాటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి: స్నేహితుడు గోవర్ధన్
సాయితేజ చిన్ననాటి నుంచి సైక్లింగ్, రన్నింగ్లో ఎంతో ప్రతిభ చూపేవాడని స్నేహితుడు గోవర్ధన్ చెప్పారు. చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే ఆసక్తి అతడికి ఉండేదని.. క్రీడల్లో ఎంతో యాక్టివ్గా ఉండేవాడన్నారు. సాయితేజ స్నేహితుడు కావడం తమకు గర్వంగా ఉందని.. అదే సమయంలో అతడు అమరుడు కావడం బాధగానూ ఉందని గోవర్ధన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్