Infection Vs Vaccine: ఏ యాంటీబాడీలు ఎక్కువ రోజులు ఉంటాయ్..?
కొవిడ్ ఇన్ఫెక్షన్ కంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు వైరస్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..!
లఖ్నవూ: కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఎంతకాలం ఉంటాయనే విషయంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సాధారణంగా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీలు, వ్యాక్సిన్ వల్ల వృద్ధి చెందే యాంటీబాడీల్లో ఏవి ఎక్కువ రోజులు రక్షణ కల్పిస్తాయనే దానిపైనా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ ఇన్ఫెక్షన్ కంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు వైరస్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ జరిపిన అధ్యయనంలో వ్యాక్సిన్ల వల్లే మెరుగైన రక్షణ కలుగుతోందని తేలింది.
శరీరంలో కరోనా యాంటీబాడీలు ఎన్నిరోజుల ఉంటాయని తెలుసుకొనేందుకు లఖ్నవూలో 2వేల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై అధ్యయనం చేపట్టారు. దీనిలో సాధారణంగా కొవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే యాంటీబాడీలు మూడు నుంచి నాలుగు నెలల తర్వాత క్షీణించిపోతున్నట్లు గుర్తించగా.. అదే రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉంటున్నాయని కనుగొన్నారు. 90శాతం వైద్యులు, పారామెడికల్ సిబ్బందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 68శాతం మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోగా 11శాతం మంది ఒకడోసు తీసుకున్నారు. ఇక మరో 11శాతం వ్యాక్సిన్ తీసుకోని వారిలో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కనుగొన్నారు. రెండు డోసులు తీసుకున్న 5శాతం మందిలో అసలు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని పరిశోధకులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా