TS News: రూ.10వేల కోట్లతో ఆరోగ్యశాఖ బలోపేతం: హరీశ్రావు
తెలంగాణలో రాబోయే రోజుల్లో రూ.10వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని వైద్యారోగ్యశాఖ
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే రోజుల్లో రూ.10వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డును ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రూ.33 కోట్లతో నిలోఫర్లో మరో 800పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యానికి దీటుగా సేవలను అందించాలని వైద్యులను కోరారు. హైదరాబాద్కు నలువైపులా నాలుగు మెడికల్ టవర్లను తీసుకురావాలని కృషి చేస్తున్నట్లు హరీశ్రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమం నిలోఫర్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉందని చెప్పారు.
‘‘తెలంగాణలో కరోనా రెండో దశ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయి. వ్యాక్సినేషన్లో దేశ సగటు కంటే తెలంగాణ ముందుంది. కరోనా మూడో దశ సన్నద్ధతకు రూ.133కోట్లు కేటాయించాం. చిన్నపిల్లల కోసం 5వేల పడకలను సిద్ధం చేశాం. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం నుంచి 50శాతం పెరిగాయి. తల్లి, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. మరో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి’’ అని హరీశ్రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!