Ts News: కొవిడ్ సమయంలో.. ఆ ఘనత గాంధీ ఆస్పత్రికే దక్కింది: హరీశ్రావు
కొవిడ్ సమయంలో దాదాపు 84 వేల మందికి వైద్య సేవలు అందించిన ఘనత గాంధీ ఆస్పత్రిదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బతకడం కష్టం
హైదరాబాద్: కొవిడ్ సమయంలో దాదాపు 84 వేల మందికి వైద్య సేవలు అందించిన ఘనత గాంధీ ఆస్పత్రిదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బతకడం కష్టం అనే స్థితిలో ఉన్న వారికి సైతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించి ప్రాణాలు పోశారని కితాబిచ్చారు. అధునాతన సౌకర్యాలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యూనిట్ను మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీతో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 సీటీ స్కాన్ యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. గాంధీలో గత రెండేళ్లుగా క్యాథ్ ల్యాబ్ పనిచేయక పోవటంపై అధికారులతో చర్చించానని.. త్వరలోనే క్యాథ్ ల్యాబ్ని తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు తెలిపారని.. త్వరలో మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని మంత్రి తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కేవలం 15 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్గా తేలిందన్నారు. వారిలో ఇప్పటికే 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్గా నిర్ధారణ అయిందని.. మరో ఇద్దరికి సంబంధించిన సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించిన హరీశ్రావు.. రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ