Ts News: ఔటర్ను తలదన్నేలా రీజినల్ రింగ్రోడ్డును తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ఔటర్ రింగ్రెడ్డును మరిపించేలా ప్రాంతీయ రింగ్రోడ్డును నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్...
ఔటర్ రింగ్రోడ్డుపై విద్యుద్దీపాలను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: ఔటర్ రింగ్రెడ్డును మరిపించేలా ప్రాంతీయ రింగ్రోడ్డును నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పటాన్చెరు ఇంటర్ఛేంజ్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై ఎల్ఈడీ విద్యుత్ దీపాలను కేటీఆర్ ప్రారంభించారు. 2018లో 22 కి.మీ. మేర ఔటర్పై విద్యుద్దీపాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మిగిలిన 136 కి.మీ. పరిధిలో రూ.100.22 కోట్లతో చేపట్టిన ఈ ఎల్ఈడీ లైట్లను ఇవాళ కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘‘భారతదేశంలో ఏ నగరానికి లేని మణిహారం మనకు 160 కి.మీ. ఔటర్ రింగ్రోడ్డు రూపంలో ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సహజంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అయితే ఈ ఔటర్ పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా సర్వీస్ రోడ్లు, ఇంటర్ ఛేంజ్ రోడ్లు, ఔటర్ రింగ్రోడ్డు కలిపి 270.5 కి.మీ. పరిధిలో 9,706 కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి 18,220 ఎల్ఈడీ లైట్లను అమర్చాం. ఈ రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏదో విదేశంలో ఉన్నట్లుగా అనిపించేలా విద్యుద్దీపాలను అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇంత గొప్పగా లైట్లను ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏకి నా అభినందనలు. సీఎం కేసీఆర్ ఏది తలపెట్టినా.. పెద్దగా ఆలోచిస్తారు. 340 కి.మీ. రీజినల్ రింగ్రోడ్డును కూడా ఔటర్ను తలదన్నేలా అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి