Ts News: 2 కాదు 21 రోడ్లను మూసేసి ఇబ్బంది పెడుతున్నారు: కేటీఆర్‌ ట్వీట్‌

ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్..

Updated : 18 Dec 2021 19:22 IST

హైదరాబాద్: ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల మూసివేతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్‌.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, కిషన్ రెడ్డిలకు ట్వీట్ చేశారు. 

‘‘అక్రమంగా రోడ్ల మూసివేతపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తోంటే కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదు? కేవలం రెండు రోడ్లను మాత్రమే మూసివేశారంటూ పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ ప్రకటన చేశారు. 2 కాదు 21 రోడ్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతే జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించుకుందాం’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని