
Ts News: విద్యార్థులను పాఠశాలలకు తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయులదే: సత్యవతి రాథోడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల పునఃప్రారంభంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా తండాలు, గూడేల్లోని ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి సెప్టెంబర్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని.. ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
విద్యాసంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, కావాల్సిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల వార్డెన్లకు రూ.20వేల చొప్పున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాలు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్-జీసీసీ ద్వారా సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచేలా హెల్త్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. శానిటైజేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు-లారీ ఢీ: ఒకరు మృతి, 20 మందికి గాయాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
-
World News
Senegal: సమద్రంలో బోటు బోల్తా.. 13 మంది మృతి, 40మంది గల్లంతు!
-
India News
Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
-
India News
Jammu: జమ్మూలో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు సిద్ధమే: హనుమ విహారి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- కథ మారింది..!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!