AP News: ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు: మంత్రి వెల్లంపల్లి
ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం
అమరావతి: ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. శారదాపీఠానికి భూమి కేటాయిస్తే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మం కాపాడుకునేందుకు, వేద పాఠశాల నిర్మాణం కోసం శారదా పీఠానికి భూమి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అనంతపురంలో గణపతి సచ్ఛిదానంద స్వామి ఆశ్రమానికి 17 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అన్నింటిలోనూ రాజకీయాలు చేయొద్దని తెదేపాకి సూచించారు. తెదేపా హయాంలో ఈషా ఫౌండేషన్కు కూడా భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ధర్మాన్ని కాపాడేవారికి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సత్రాల్లో భక్తులకు ఆశ్రయం కల్పిస్తారని, అన్నదాన సదుపాయం ఉంటుందని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?