KTR: వరంగల్‌కు జెన్‌పాక్ట్‌.. కేటీఆర్‌ హర్షం

వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు యూఎస్‌కు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్‌ ముందుకొచ్చింది.

Updated : 16 Dec 2021 14:09 IST

వరంగల్‌: వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు యూఎస్‌కు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్ర కంపెనీలు వరంగల్ నుంచి ఆపరేట్ చేస్తుండగా.. వీటి సరసన జెన్‌పాక్ట్‌ చేరనుంది.

వచ్చే ఆరు నెలల్లో వరంగల్‌లో ఈ టెక్ సెంటర్ సేవలను ఆరంభించనుంది. దీంతో వరంగల్‌లో కొత్తగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. జెన్‌పాక్ట్‌ రాకతో వరంగల్‌లో ఐటీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని