AP Politics: సినీ పెద్దల కోరిక మేరకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం: రోజా

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు.

Updated : 18 Sep 2021 16:21 IST

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెదేపా నేత అయ్యన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్న రోజా.. అయ్యన్న మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతోందంటూ విమర్శలు చేస్తున్నారని.. సినీ పెద్దల కోరిక మేరకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని రోజా స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని