Dalit bandhu: హుజూరాబాద్‌కు మూడో విడత నిధులు మంజూరు

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మరో రూ.200 కోట్ల నిధులను తెలంగాణ సర్కార్‌ విడుదల చేసింది. దళితబంధు..

Published : 24 Aug 2021 15:57 IST

హైదరాబాద్: హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మరో రూ.200 కోట్ల నిధులను తెలంగాణ సర్కార్‌ విడుదల చేసింది. దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌కు రూ.2 వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో దళితబంధు కోసం మూడో విడత కింద మరో రూ.200 కోట్లను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు విడుతల్లో రూ.1200 కోట్లను ప్రభుత్వం ఇచ్చిందని జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని