Ts News: వరంగల్లో 2వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
వరంగల్లో 2వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు
హైదరాబాద్: వరంగల్లో 2వేల పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్థులతో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టనున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో వరంగల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు అందుబాటులో ఉంది. వరంగల్లో 215.35 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందులోని 15 ఎకరాల్లో ప్రస్తుతం 24 అంతస్థుల భవనం నిర్మించనున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎర్రబెల్లి
వరంగల్లో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట తప్పని, మడమ తిప్పని నేత అని .. ఆయన చెప్పినట్లుగానే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. హైదరాబాద్ స్థాయి అద్భుత వైద్యం వరంగల్లోనే లభ్యమవుతుందన్నారు. దీంతో హైదరాబాద్లోని ఆసుపత్రులపైనా భారం తగ్గుతుందన్నారు. విద్యా, వైద్య పథకాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే